(మరొక) నిత్యదానము నోము కథ
టీ||"నిత్య దానము చేయు నెలత కత్యంత
సౌఖ్యంబు లమరును సత్యంబుగాను
నిత్యకల్యాణమై నెగడు నొప్పుచును
సత్యమార్గంబపుడు సాధ్యమగు నిలను"
అని యనుకొని అక్ష్తతలు వేసుకొని ప్రతిదినము చేరెడు బియ్యమును, ఒక కూరను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. అట్లొక సంవత్సరము చేసిన తరువాత ఉద్యాపనము చేసుకొనవలెను.
ఉద్యాపన:
ఎద్దుతొక్కనిధాన్యము ఎనిమిది కుంచములొక గంపలోపోసి క్రొత్తబట్టచుట్టీ కాయగూరలు, దుంపకూరలు ,ఆకుకూరలు దానిలోపెట్టి శక్తికొలది దక్షిణతో నొక బ్రాహ్మణునకు దానము చేయవలెను. శక్తితగ్గిననూ ఫలము తగ్గదు.