23, ఏప్రిల్ 2016, శనివారం

స్త్రీలవ్రత కథలు : నిత్యదానము నోము కథ



నిత్యదానము నోము కథ
ఒక రాజు అజీర్ణవ్యాధితో బాధపడుచుండెను. ఎన్ని మందులు తినిననూ అతనికి ఆరోగ్యము చేకూరలేదు. అట్లుండగా ఒకానొక బ్రాహ్మణుడు పట్టణమునకు వచ్చి పెట్టినవారికి పుట్టినదేసాక్షియని గట్టిగా పాడుచుండెను. కోటబురుజు మీదున్న రాజు ఆ బ్రాహ్మణుని మాటలు విని అతనిని దివాణములోకి రప్పించి అట్లెందుకనెనో చెప్పమనెను. అంతట బ్రాహ్మణుడు రాజా! నామాటలకు నీవే నిదర్శనము. పూర్వజన్మలో నీవు ధనము కూడబెట్టి నీవుతినక, ఇతరులకు పెట్టక పిసినిగొట్టువై యుంటివి.ఆ పాప ఫలమే యిప్పుడు నీకు అజీర్ణవ్యాధిగా వచ్చినది. ఆ వ్యాధి పోవుటకు నీవు నిత్యదానము చేయుము అని చెప్పెను. అప్పటినుండి రాజు నిత్యదానము ఒక యేడాది పాటు చేసి పిమ్మట ఉద్యాపనము చెసుకొని సుఖముగా నొండెను.

ఉద్యాపన:
ప్రతిదినము ఒక బ్రాహ్మణునకోదోసెడు ధాన్యము, ఒక కూరయు దానము చేయవలెను, ఆ విధముగా నొక ఎఏడాదిపాటు చేసిన పిమ్మట ఎద్దుతొక్కని ధాన్యము ఎనిమిది కుంచములుతెచ్చి గంపలో పోసి దానికి క్రొత్తబట్ట చుట్టి, దానిలొ ఆమె కూరలు దుంపకూరలు ,కాయగూరలు, దక్షిణ తాంబూలములతో ఆ బ్రాహ్మణునకు దానమియ్యవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి