23, ఏప్రిల్ 2016, శనివారం

స్త్రీలవ్రతకథలు : ధైర్యలక్ష్మి నోము కథ



ధైర్యలక్ష్మి నోము కథ
ఒక బ్రాహ్మణస్త్రీకి ఐదుగురు తమ్ముళ్ళుండిరి. ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణంమీదకు వచ్చెడిది. అందుచే నామె పెండ్లికి వెళ్ళేది కాదు. ఆ విధముగా నలుగురకు పెళ్ళిండ్లు అయినవి. అయిదవ తమ్ముని పెండ్లి కూడా జరుగుచున్నది. అప్పుడుకూడ యెప్పటి వలెనే ఆమె భర్తకు ప్రాణము మీదకి వచ్చెను. ఈ సారి ఆమె తన ధైర్యలక్ష్మియే తనను కాపాడగలదని యెంచుకొని రోగి అగు మగనిని ఇంటిలోపెట్టి తమ్ముని పెండ్లికి ప్రయాణమై పోవుచుండగా దారిలోనొక జువ్వి చెట్టు కనబడెను . ఆమె ఆ చెట్టుకు ముమ్మారు ప్రదక్షిణలు చేసి తల్లీ! నీవే నాపాలిట ధైర్య లక్ష్మివి. నేను పుట్టింటినుండి తిరిగి వచ్చేసరికి నా భర్త ఆరోగ్యముగనున్నచో నీకు ఏడాది పొడుగున పూజచేసెదను, అని నమస్కరించి వెళ్ళిపోయెను. పెండ్లైన వెంటనే ఆమె తిరిగి యింటికివచ్చుసరికి భర్త ఆరోగ్యముగ నుండెను. ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి