12, ఏప్రిల్ 2016, మంగళవారం

స్త్రీలవ్రతకథలు - సహస్రఫలముల నోము కథ



సహస్రఫలముల నోము కథ

ఒకనాడు పార్వతి శివుని నాథా! ఎల్లకాలము చేయు నోము వ్రతమేదని యడుగగా, ఆ స్వామి పార్వతీ! సహస్ర ఫలముల నోము ఎల్లకాలము చేయదగిన నోము. ఆ నోము చేసిన స్త్రీకి సర్వదేవతల దయయు కొంగు బంగారమైయుండునని చెప్పెను.

ఈ కథను చెప్పుకొని అక్షతలు వేసుకొని ఉద్యాపన చేసుకొనవలెను.

ఉద్యాపనము:
వేయి రకముల పండ్లు రకమునకొక వేయి చొప్పున యేరుకొని యవి వచ్చు కాలములో తగిన దక్షణలతో వేయిమంది దంపతులకు ఇచ్చుచుండవలెను. ఒకే రకము పండ్లను, ఇచ్చినవారికి మరల యివ్వరాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి