గంధతాంబూలము నోము కథ
ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి "అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే
నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెకును "అని
చెప్పెను . తెల్లవారిన తరువాత ఆమె నోము నోచుకొని ప్రతిదినము ఒక తాంబూలముతో ఐదు గంధపు ఉండలను ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను .
ఉద్యాపన :
ఒక ముత్తైదువునకు చీర , రవికెలగుడ్డ , ఆకులు , పోకలు , గంధపుఉండలు , దక్షిణ వాయనమీయవలెను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి