14, ఏప్రిల్ 2016, గురువారం

స్త్రీలవ్రతకథలు : బచ్చల గౌరి నోము కథ



బచ్చల గౌరి నోము కథ
ఒక చిన్నది చక్కగా సంసారము చేసుకొనుచుందగా పండుగలకు తీసుకొను వెళ్ళుట కామె అన్న వచ్చెను. అన్న వచ్చెనని ఆనందముతో ఆ చిన్నది అన్ని పిండివంతలు తయారు చేసి పులుసు పోపునకు దొడ్డిలోనున్న కరివేపాకు తెమ్మని అన్నను పంపెను. అతడా చెట్టునెక్కు చుండగా పాము కరచినందున చనిపోయెను.యెంతకూ అన్న రాక పోవుటచూచి, అ చిన్నది దొడ్డిలోనికి వెళ్ళుసరికి చొంగలు కక్కుచు నతడు పడియుండెను. అది చూచి ఆమె "లబో దిబో" మని యేడ్చుచుండగా ఇరుగు పొరుగు అమ్మలక్కలు అక్కడకు చేరిరి. పార్వతీదేవి ఒక ముసలి దానివలె వచ్చి ఆమెతో "అమ్మయీ! యేడవకు ఇంటి లోనికి పోయి బచ్చలగౌరి నోమును నోచుకుని తరువాత వచ్చి మీ అన్నను పిలువుము. అతడు బ్రతుకగలడు." అని ఆ నోము ఉద్యాపనము జెప్పి మాయమైపోయెను. ఆమె ఆ ముసలిది పార్వతిదేవి యని గ్రహించి, ఆమెచెప్పిన విధముగా నోమునోచుకుని యన్నను పిలువగా నోము ఫలమున అతడు బ్రతికెను.అప్పటినుండీ వెన్ను చలవను స్త్రీలందరూ నోమును నోచుకుని అన్నదమ్ములతో అక్కాచెల్లెళ్ళతో ఆలుబిడ్డలతో, తోడికోడండ్రతో సుఖించుచుండిరి. ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన:
వెండిబచ్చలకాయ నొకదానిని, బంగారుబచ్చలకాయ నొకదానిని చేయించి పూజ చెయవలెను. తరువాత నొక చీరను, రవికలగుడ్డను, బచ్చలిచెట్టును వెండిబచ్చలకాయను, దక్షిణ తాంబూలములను, ఒక ముసలి ముత్తైదువునకు వాయన మియ్యవలెను. శక్తి తగ్గినను ఫలము హెచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి