12, ఏప్రిల్ 2016, మంగళవారం

స్త్రీలవ్రతకథలు - కందగౌరీనోము కథ




కందగౌరీనోము కథ
ఒక రాజునకు లేక లేక ఒక కూతురు కలిగెను. ఆమె పుట్టినది మొదలుపోరుపెట్టుచుండెను. ఆ పోరు రాను రాను యేడ్పుగామారెను. ఆ రాచ బిడ్డ పెద్దదైనప్పటికీ యేడుపు మానలేదు.ఆమెను గూర్చి ఆ ఊరి ప్రజలు చెప్పుకొనుచుండిరి. అది సహించలేక రాజు ఆమెచే పార్వతీ పూజను చేయించగ ఒకనాడు పార్వతీదేవి ఆతని కలలో కనిపించి నీకుమార్తె  పూర్వజన్మముున కందగౌరి నోము నోచి ఉల్లంఘించినది. అందుచేత ఈ జన్మలో జీవితమంతాదుఃఖపూరితమయ్యెను. ఆమె యేడుపు పోవుటకు కందగౌరీనోము నోపింపుడు, అని చెప్పి అంతర్ధానమయ్యెను. తెల్లవారి మేల్కొనునంతనే అతడు తన కుమార్తెతోఆ నోము నోపించెను. అప్పటినుండి ఆమె కంటికి నీరులేక,కష్టమను మాటలేక కలకాలము సుఖముగా ఉండెను.
ఉద్యాపనము
ఈ కథ చెప్పుకొని యేడాదిపొడుగున అక్షతలు వేసుకొని ఉద్యాపనము చెసుకొనవలెను. వెండిదుంప, ఒక బంగారుదుంప చేయించి వీశేయేబులము కందదుంపలను దగ్గర పెట్టి నల్లపూసలు, లక్కజోడు, తామ్బూలములు కలిసి ముత్తైదువులకు వాయన మియ్యవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి